NRML: కుబీర్ మండలంలోని సోమేశ్వర్, బ్రాహ్మశ్వర్ గ్రామాలకు రూ. 8 లక్షలు, మార్లగొండ పంచాయతీ అనుబంధ గ్రామాలకు రూ. 21 లక్షలు, సేవాదాస్ నగరానికి రూ. 3 లక్షలు సీసీ, డ్రైనేజ్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు.