SKLM: టెక్కలి ఐటెమ్ కాలేజీలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల్లో సైద్ధాంతిక స్పష్టత, సేవా భావం పెంపొందించడం ముఖ్యమని అన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.