ASF: కౌటాల మండలంలోని మాలి సంఘం భవనంలో మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యా వికాసానికి ఆమె చేసిన కృషిని నేతలు స్మరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంత్ రావు, నికోడే గంగారం, జిల్లా ఉపాధ్యక్షుడు ఆదే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.