TPT: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. 40 ఏళ్ల చరిత్రలో ఏ పాలకులు చేయని అభివృద్ధిని రోజా వైసీపీ పాలనలో చేసి చూపారని మాజీ సీఎం కొనియాడారు. కూటమి పాలనలో ప్రజలు నష్టపోవడం అందరూ ఇప్పటికే గుర్తించారన్నారు.