WGL: న్యూశాయంపేటలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ‘వన మయూరి’ సంచార జంతు ప్రదర్శన వాహనం గత 15 ఏళ్లుగా ఉపయోగం లేక మూలన పడి ఉందని ప్రజలు ఆరోపించారు. పర్యావరణం, జంతు సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ వాహనం పాడై నిరుపయోగంగా మారిందని వాపోయారు. అధికారులు స్పందించి వాహనాన్ని మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.