CTR: చిత్తూరు జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలుతో మరియు జిల్లా అధికారులతో పరిశ్రమల ప్రమాదాల నివారణపై ముందస్తు చర్యల అమలులో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.