కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం ముమ్మరంగా నిర్వహిస్తోంది. పోలీసులు అమలాపురంలో మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున డ్రైవర్లను గుర్తించి, నీళ్లతో ముఖం కడిగించి, వారు పూర్తిగా అప్రమత్తమైన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.