MNCL: జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. పన్నుల వసూలు, మురుగు కాలువ వ్యవస్థ శుభ్రత, వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు.