KNR: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 92వ జయంతి వేడుకలు చొప్పదండి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ వడ్లురి సరిత, వైస్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ళ మానస హాజరై మాట్లాడుతూ.. బహుజనుల ఐక్యతకు కృషి చేసిన గొప్ప నాయకుడు అని అన్నారు.