KRNL: కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణతో పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతను బలోపేతం చేసే దిశగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గట్టి చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు, హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు ఆధునిక పరికరాలు పంపిణి చేశారు.