KDP: ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా టీటీడీ జిల్లా అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించారు. అలాగే తలంబ్రాలు ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం సిద్ధం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.