NLG: వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేశారు. దీంతో లోడ్ తట్టుకునేందుకు సబ్జెస్టేషన్లలో అదనపు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.