RR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామంలోని, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం రాముడు చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయం అని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.