NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన పద్మ పేదరికాన్ని గమనించిన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆమె నివాసానికి వెళ్లి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ చేతుల మీదుగా రూ. 11,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంపెల్లి రమేష్, హరిబాబు, విజయ్, యాదయ్య పాల్గొన్నారు.