NLG: గుండ్లపల్లి(డిండి) మండల కేంద్రానికి సంబంధించి తైబజార్ వేలంపాటను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి జంగయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రూ.5,500 డిపాజిట్ ముందుగానే చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.