NRPT: నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ నాగిరెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మప్ప, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.