వనపర్తి మండలంలోని సవాయిగూడెం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ.రజని పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, విద్యా హక్కు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రాథమిక విధులు, హక్కుల గురించి వివరిస్తూ చట్టాల పట్ల అవగాహనతోనే నేరాలను అరికట్టవచ్చ అన్నారు.