NZB: సిరికొండ మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంట ఎండుతోంది. బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పందిమడుగు, చీమలపల్లి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్ట దశలో ఉన్న పైరును కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్ నీటికి రూ. 1,000 చొప్పున వెచ్చించి నీటిని అందిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పాల్పడుతున్నారు.