MNCL: అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాలలో జరిగింది. కూలి పని చేస్తూ జీవనం సాగించే బోనుగురు లింగమూర్తి ఈ రోజు తెల్లవారుజామున గూడ్స్ రైలు కింద బలవన్మరణానికి పాల్పడినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్ళు ఉనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.