JN: హైదరాబాదులో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి రైతు ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు. అనంతరం రైతు ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై కాసేపు వారితో రాఘవరెడ్డి క్షుణ్ణంగా చర్చించారు.