కామారెడ్డి పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను SP రాజేశ్ చంద్ర పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు.