MNCL: ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మంచిర్యాలలో లెర్నింగ్ స్టడీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు రెండో రోజు శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. సర్వేకు జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.