KMR: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి సూచించారు. ఆదివారం కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మహిళా విభాగం నాయకురాళ్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేసే పథకాలను లబ్ధిదారులకు అందే విధంగా చూడాలన్నారు.