ADB: ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.