SRD: పటాన్చెరు మండలం బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం చెరువు పరిధిలో కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫెన్సింగ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు.