WNP: రైతు దేశానికి వెన్నెముక అని, సాగు లేకపోతే మానవ సమాజానికి మనుగడ లేదని డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సాయి అఖిల ట్రస్ట్ రూపొందించిన ‘రైతుకు వందనం’ పాట వండర్ రికార్డు సాధించిన సందర్భంలో ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రాజవర్ధన్ రెడ్డి ‘ఉత్తమ రైతు’ పురస్కారాన్ని అందుకున్నారు.