SRPT: నడిగూడెం మండలం కర్వీరాల క్లస్టర్ పరిధిలోని రైతులందరూ వెంటనే ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని ఏఈవో ఉప్పయ్య ఇవ్వాళ సూచించారు. భవిష్యత్తులో పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల లబ్ధికి ఇది తప్పనిసరని తెలిపారు. దీని ద్వారా రైతులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డు లభిస్తుందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.