NRML: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు అంబాజీ తెలిపారు. మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు.