BDK: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు భద్రాచలం చేరుకోగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామయ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.