MNCL: నస్పూర్లో సోమవారం భారీ గాలులతో అకాల వర్షం కురిసింది. దీంతో 7వ డివిజన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ లైన్లో ఒక మామిడి చెట్టు, నాలుగు విద్యుత్ స్తంబాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ అక్కడికి చేరుకొని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.