హుజూర్నగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మురుగు నీటి పూడికతీత, వీధి దీపాల మరమ్మతులు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుకు నిధులు కేటాయించడంపై ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. లేఅవుట్ స్థలాల పరిరక్షణతో పాటు ఎన్ఎస్పీ సమీపంలో వరద కాలువ నిర్మించాలని సమావేశంలో చర్చించారు.