PDPL: ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు నంది మేడారం కోర్టు న్యాయవాది ఆకారి రాజేశం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చదువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక సాధనం’ అని పేర్కొన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో రాబోయే పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.