ADB: రైతులకు రైతుబంధు అందించాలని కోరుతూ జైనథ్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిర్వహిస్తూ నాయకులు అర్థనగ్న ప్రదర్శనతో రైతుల నుంచి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. పెట్టుబడికి సరిపోను పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారన్నారు. రైతు భరోసాను వారి ఖాతాలో జమ చేయాలని నాయకుడు పిడుగు స్వామి డిమాండ్ చేశారు.