WNP: వసతి గృహాలు, సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు నిబంధనల ప్రకారం మెనూ అనుసరించి నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్షించారు. సంక్షేమ విద్యాలయాలను సంబంధిత అధికారులు సందర్శించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీయాలని ఆదేశించారు.