NRPT: యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. తెలంగాణను క్రీడారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.