MDK: సింగూరు ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూణే CWPRS రిటైర్డ్ ఛైర్మన్, నిపుణుడు విజయ్ త్రింబక్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఆనకట్టను సందర్శించింది. ఆనకట్ట రివిట్మెంట్ పనులను పూర్తి స్థాయి నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు.