MDK: మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమని అన్నారు. రామాయంపేట సీఐటీయు కార్యాలయంలో ఆదివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.