NZB: ప్రజావాణిలో సేకరించిన అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై పరిశీలన జరుపుతూ.. వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.