KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తారన్నారు. ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.