MBNR: తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో నూతన ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో నూతన దేవాలయం నిర్మిస్తుండడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు.