NGKL: మంగనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణా రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.