హైదరాబాద్లోని అమీర్పేట్-రాయదుర్గం మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. సుమారు 20 నిమిషాల పాటు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం సమస్య పరిష్కారం కావడంతో సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి.