ADB: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శనివారం పౌర దేవి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు గుడిహత్నూర్ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని MLA పిలుపునిచ్చారు.