NRPT: మరికల్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అందిస్తున్న ‘రంజాన్ తోఫా’ను తహశీల్దార్ రామకోటి, సర్పంచ్ చెన్నయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.