నిజామాబాద్: ధర్పల్లి మండలం సీతాయిపేట గుడి తండాకి చెందిన జరుపుల కాంతమణి అనే మహిళ శవం 2026 మార్చి 11న అనుమానాస్పద స్థితిలో ధర్పల్లి గ్రామం బస్టాండ్ వెనుకాల ఓపెన్ ప్లాట్స్ వద్ద కనిపించింది. ఈ ఘటనపై ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఇవాళ నిందితుడు గుండ్ల నడుకుడ నర్సయ్య S/o పోశన్నను పట్టుకొని రిమాండ్కు పంపించారు.