SRD: కుమ్మెర జాతరలో రజక, దళిత కుటుంబాలపై అగ్రవర్ణాల దాడిని నిరసిస్తూ సోమవారం ఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. పసికందు మృతికి కారణమైన వారిపై హత్యాకేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి రమేష్, సీపీఐ నాయకులు చిరంజీవి పాల్గొన్నారు.