SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి, రూ.22,500 కోట్ల బడ్జెట్తో పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్ నగర్లోని రామస్వామి వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంత్ లాల్ పవార్తో కలిసి పరిశీలించారు.