KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతుంది. ఆదివారం యాసంగి పంటల కోసం 234 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, 23 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని వెల్లడించారు. ఇప్పటివరకు యాసంగి పంటల కోసం 0.888TMCల నీటిని విడుదల చేయగా, ప్రస్తుత నీటి మట్టం 0.657TMCల నీరు నిల్వ ఉంది.