JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయికల్ ఎంపీడీవో చిరంజీవి అన్నారు. మార్చి 6-15 వరకు నిర్వహించనున్న కార్యక్రమంపై అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం అవగాహన కల్పించారు. తహశీల్దార్ నాగార్జున, ఎంపీఓ సుష్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.