NZB: ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు, ఆసుపత్రిలోని సదుపాయాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రోగులకు ఎల్లప్పుడూ మెరుగైన వైద్యం అందించాలని MLA సూచించారు.